ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. రెండో బ్లాక్లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలి వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
అయితే రెండో బ్లాక్లోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనిత పేషీలు ఉన్నాయి.
అయితే.. తెల్లవారుజామున ప్రమాదం జరిగింది కాబట్టి, ఆ సమయంలో సిబ్బంది ఎవరూ కార్యాలయాల్లో లేరు. ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు.
For more related news : https://theshakthi.com/category/categories/trending-news/