సెలబ్రిటీలకు షాక్.. 11 మంది యూట్యూబర్లపై కేసు

సెలబ్రిటీలకు షాక్.. 11 మంది యూట్యూబర్లపై కేసు

సెలబ్రిటీలకు షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసినందుకు 11 మంది యూట్యూబర్లపై పోలీసులు కేసు నమోదు చేసారు. నిందితుల్లో హర్షసాయి, విష్ణుప్రియ, ఇమ్రాన్‌ఖాన్, రీతూ చౌదరి, బండారు శేషయాని సుప్రీత, కిరణ్‌గౌడ్, అజయ్, సన్నీయాదవ్, సుధీర్ సహా పలువురు సెలబ్రిటీలు, టీవీ నటులు ఉన్నారు. వీరిలో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కూడా ఉన్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఒక యువకుడు అమీర్‌పేటలోని ఓ సంస్థలో శిక్షణ తరగతులకు హాజరవుతున్నాడు. తనతోపాటు శిక్షణ పొందుతున్న పలువురు విద్యార్థులు బెట్టింగ్ యాప్‌లకు బానిసలై బోల్డంత డబ్బు నష్టపోయినట్టు గుర్తించాడు. దీంతో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారంటూ పలువురు యూట్యూబర్లపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినవారిపై కేసు నమోదు చేసారు. ప్రస్తుతం ఈ టాపిక్ ట్రెండింగ్ లో ఉంది.

పోలీసులు సోమవారం 11 మంది యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై గేమింగ్‌ యాక్ట్‌లోని సెక్షన్లు 3, 3ఏ, 4.. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66డీ, భారత న్యాయ సంహిత(బీఎన్‌ఎ్‌స)లోని 318(4) సెక్షన్‌ ప్రకారం క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. వీరందరికీ త్వరలోనే నోటీసులు జారీచేసి విచారించనున్నారు.