cylinder

మహిళలకు అలర్ట్.. ఉచిత సిలిండర్లకు లాస్ట్ డేట్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే తొలి గ్యాస్ సిలిండర్ పొందే గడువు త్వరలోనే ముగియనుంది. 2024 అక్టోబర్ 29న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం కాగా.. 2025 మార్చి 31వ తేదీ వరకూ తొలి సిలిండర్ ఉచితంగా అందిస్తున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ ఉచితంగా పొందొచ్చు. అయితే ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరి.

మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఇప్పటివ‌ర‌కు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలన్నారు. కాగా, ఇప్పటివరకు 98 లక్షల మంది తొలి ఉచిత సిలిండర్ వినియోగించుకున్నారని ఈ సంద‌ర్భంగా మంత్రి నాదెండ్ల తెలిపారు. ఈ సంద‌ర్భంగా దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

ఉచిత సిలిండర్ కావాల్సిన వారు సాధారణ పద్ధతిలో ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల లోపు గ్యాస్ డెలివరీ ఇస్తారు.ఆ తర్వాత సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో తిరిగి జమ చేయ‌డం జ‌రుగుతుంది.ఒక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తారు. అయితే వీటిని ఒకేసారి కాకుండా నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.

ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలు
1)ఎల్.పి.జి.కనెక్షన్ కలిగి ఉండటం
2) రేష‌న్‌ కార్డ్
3) ఆధార్ కార్డు
4). ఆధార్ కార్డుతో రైస్ కార్డుతో అనుసంధానం అయి ఉండాలి.

విద్యార్థులకు సర్కార్ శుభవార్త: https://youtu.be/W6cuJ265hwc