హైదరాబాద్ నగరంలోని కంచ గచ్చిబౌలి భూములపై తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. 400 ఎకరాల భూములపై ప్రభుత్వానికి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ)కు మధ్య వివాదం నెలకొన్న విషయం విదితమే.
ఈ పిటిషన్లపై బుధవారం వాదనలు విన్న హైకోర్టు, ఒక్కరోజు పనులను నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై గురువారం మరోసారి విచారణ చేపట్టింది.
ఈ కేసుకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని అడ్వొకేట్ జనరల్ న్యాయస్థానాన్ని కోరారు. అడ్వోకేట్ జనరల్ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఈ కేసుపై రోజురోజుకు టెన్షన్ పెరుగుతుంది.
For more related news:https://theshakthi.com/category/categories/trending-news/