sports

India-Pakistan Border Tension: ఐపీఎల్ మ్యాచ్ మధ్యలోనే నిలిపివేత

భారత్, పాకిస్థాన్ మధ్య దాడులు, ప్రతిదాడుల పర్వం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. తాజాగా భారత్… పాకిస్థాన్ నగరాలపై నిప్పులు చెరిగిన నేపథ్యంలో, పాకిస్థాన్ జమ్మూ, రాజస్థాన్ ప్రాంతాలపై దాడులకు తెగబడింది. పాక్ దాడులను భారత్ సమర్థంగా తిప్పికొడుతోంది.

కాగా, సరిహద్దుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొనడంతో… ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ను మధ్యలోనే నిలిపివేశారు. ఐపీఎల్ మ్యాచ్ అర్ధంతరంగా రద్దు కావడం ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితులకు అద్దం పడుతోంది.

భద్రతా సిబ్బంది ఆదేశాల మేరకు స్టేడియంలోని లైట్లన్నింటినీ ఆపివేసి, అత్యవసర పరిస్థితిని విధించారు. ప్రేక్షకులను వెంటనే స్టేడియం నుంచి ఖాళీ చేయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్లు, సిబ్బంది, ప్రేక్షకుల భద్రతకే తమ ప్రథమ ప్రాధాన్యత అని బీసీసీఐ స్పష్టం చేసింది.

అందుకే మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చిందని పేర్కొంది. ప్రభుత్వం, భద్రతా సంస్థల నుంచి అందే సూచనల ఆధారంగా భవిష్యత్ మ్యాచ్‌ల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ప్రతినిధులు తెలిపారు.

For more related news : https://theshakthi.com/category/categories/trending-news/