ధోని అభిమానులకు గుడ్ న్యూస్. ధోని మళ్ళీ కెప్టెన్ బాధ్యతలని చేపట్టబోతున్నాడనే వార్త వైరల్ అవుతుంది. CSK సొంత మైదానంలో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో తడపడుతుంది. ఈ మ్యాచ్ లో ధోని సారథిగా వ్యవహరించనున్నాడు.
ప్రస్తుతం కెప్టెన్గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ గాయపడడంతో ధోనీ కెప్టెన్సీ చేపడతాడని తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ సమయంలో ఎడమ మోచేతికి గాయంతో బాధ పడిన రుతురాజ్ .. ఢిల్లీతో మ్యాచ్కు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ నేపథ్యంలోనే మాజీ కెప్టెన్ అయిన ధోనీకే మళ్లీ పగ్గాలు అప్పగించాలని యాజమాన్యం భావిస్తోందట. ప్రస్తుతం ఆడిన మూడు మ్యాచుల్లో ఒకే ఒక విజయంతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న చెన్నైకి ధోనీ సారథ్యం వహించడం కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే CSK మరింత జోష్ తో ఈ IPL లో ముందుకు వెళ్లొచ్చని భావిస్తుంది. ఈ సీజన్ లో వెనుకపడ్డ CSKకి, ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్ కీలకం కానుంది.
For more related news : https://theshakthi.com/category/categories/sports/