virat

Virat Kohli Retirement : కోహ్లీ సంచలన నిర్ణయం

భారత సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు క్రికెట్‌కు అతడు గుడ్‌బై చెప్పేశాడు. 14 ఏళ్లుగా టెస్టుల్లో భారత జట్టుకు ఆడుతూ వచ్చానని.. ఇది తనకు దక్కిన గౌరవమని కోహ్లీ చెప్పాడు. ఇన్నేళ్లు లాంగ్ ఫార్మాట్‌లో కొనసాగుతానని అనుకోలేదన్నాడు.

ఈ జర్నీలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని.. ఇది తనను చాలా విధాలుగా మార్చిందని, ఎన్నో విలువైన పాఠాలు నేర్పిందన్నాడు విరాట్. దీన్ని అంత ఈజీగా మర్చిపోలేనంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లో ఎమోషనల్ అయిపోయాడు కోహ్లీ.

టెస్ట్ టీమ్ కోసం ఏమేం చేయాలో అంతా చేశానని చెప్పుకొచ్చాడు. భారత జట్టు తనకు ఎంతో ఇచ్చిందని, పూర్తి కృతజ్ఞతా భావంతో టెస్ట్ టీమ్‌ను వీడుతున్నానని కోహ్లీ పేర్కొన్నాడు. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన వారందరికీ అతడు థ్యాంక్స్ చెప్పాడు.

2011లో వెస్టిండీస్‌ తో మ్యాచ్ ద్వారా ఆయన టెస్టుల్లో అరంగేట్రం చేశారు. తన కెరీర్‌లో కోహ్లీ 123 టెస్టు మ్యాచ్‌లు ఆడి 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో మొత్తం 9,230 పరుగులు చేశారు. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో కోహ్లీ చివరి టెస్టు ఆడాడు.

రోహిత్ రిటైర్ మెంట్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇక ఈ సీనియర్ బ్యాటర్లు ఇద్దరు వన్డే మ్యాచుల్లో కనిపించనున్నారు. వీరి టార్గెట్ 2027 వరల్డ్ కప్. కోహ్లీ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. హ్యాపీ రిటైర్మెంటె లెజెండ్ అని కామెంట్స్ చేస్తున్నారు.

For more related news : https://theshakthi.com/category/categories/trending-news/